ఛత్తీస్గఢ్ పోలీసులు చేపట్టిన 'లోన్ వరాటు' కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోంది. దీనితో గత 20 రోజుల్లో 65 మంది నక్సల్స్... పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇంటికి తిరిగి వచ్చారు...!
దంతెవాడ జిల్లాలోని చిక్పాల్ గ్రామంలో 20 రోజుల క్రితం పోలీసులు 'లోన్ వరాటు' (మీ ఇంటికి తిరిగి రండి) కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి గ్రామానికి వెళ్లి స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామస్థులకు ఫోన్ నంబర్లు ఇచ్చిన పోలీసులు... లొంగిపోవాలనుకునే నక్సల్స్ నేరుగా తమను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు 65 మంది లొంగిపోయారు. వీరిలో చాలా మందిపై లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
లొంగిపోయిన నక్సల్స్కు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.