తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​లో నేడు పాఠశాలల పునఃప్రారంభం

జమ్ముకశ్మీర్​లో ఆంక్షల పూర్తిస్థాయి తొలగింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేటి నుంచి శ్రీనగర్​లోని 190 పాఠశాలలను పునఃప్రారంభించేందుకు అనుమతించింది. కశ్మీర్​ లోయలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయని జమ్ముకశ్మీర్ ముఖ్య కార్యదర్శి రోహిత్ కన్సల్ వెల్లడించారు.

By

Published : Aug 19, 2019, 7:57 AM IST

Updated : Sep 27, 2019, 11:42 AM IST

శ్రీనగర్​లో నేటి నుంచి పాఠశాలల పునరుద్ధరణ

ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​వ్యాప్తంగా విధించిన ఆంక్షల తొలగింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శ్రీనగర్​లో 190 ప్రాథమిక పాఠశాలలు నేడు పునఃప్రారంభం కానున్నట్లు జమ్ముకశ్మీర్​ముఖ్య కార్యదర్శిరోహిత్ కన్సల్ వెల్లడించారు. కశ్మీర్​ లోయలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయని స్పష్టం చేశారు.

"శ్రీనగర్ జిల్లాలోనే 190 పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. మౌలిక వనరుల కల్పన, అభివృద్ధి పనుల పునరుద్ధరణతో పరిస్థితులు మరింత మెరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. "

- రోహిత్ కన్సల్,ముఖ్య కార్యదర్శి, జమ్ముకశ్మీర్

ఆదివారం కూడా ఆంక్షల సడలింపును కొనసాగించినట్లు స్పష్టం చేశారు. శనివారం 35 పోలీస్​ స్టేషన్ల ప్రాంతాల్లో ఆంక్షలను పాక్షికంగా ఎత్తేశామని, ఆదివారం 50 ఠాణాలకు ఈ పరిధిని విస్తరించామని ఆయన కన్సల్ పేర్కొన్నారు. నిషేధాజ్ఞల తొలగింపు సమయాన్ని ఆరు నుంచి ఎనిమిది గంటలకు పెంచామని తెలిపిన ఆయన దుకాణ యజమానులు వారి షాపులను ప్రారంభించుకోవచ్చని ప్రకటించారు.

ల్యాండ్​ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సాధ్యమైనంత త్వరగా ఫోన్లను వినియోగం లోకి తెస్తామన్నారు. కశ్మీర్​లోయలో ఫోన్ల సేవలను పునరుద్ధరించేందుకు బీఎస్​ఎన్​ఎల్ అధికారులు పనిచేస్తున్నారని కన్సల్ ప్రకటించారు.

ఇదీ చూడండి: 'మహాత్ముడి కలల భారతాన్ని నిర్మించామా?

Last Updated : Sep 27, 2019, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details