తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​కు కరోనా

ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​కు, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

By

Published : Nov 2, 2020, 11:54 AM IST

Ganeshi lal_Covid
ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​కు కరోనా

ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. భార్యకు, నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

గవర్నర్​ ట్వీట్

ప్రస్తుతం అందరూ భువనేశ్వర్​లోని ఎస్​యూఎమ్ కొవిడ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని గవర్నర్​ తెలిపారు. తన​ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

గవర్నర్ కొవిడ్​ నుంచి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్​ చేశారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​. ​

ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్, ట్వీట్

ఇదీ చదవండి:ఝార్ఖండ్​లో నలుగురు నక్సల్స్ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details