తెలంగాణ

telangana

బంగాల్​, కేరళ ముఖ్యమంత్రులకు 'మోదీ' సవాల్​..!

By

Published : Jan 5, 2020, 12:12 PM IST

Updated : Jan 5, 2020, 3:20 PM IST

జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​)పై దేశ ప్రజల్లో సందేహాలు నెలకొన్న వేళ.. బిహార్​ ఉప ముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది మే 15 నుంచి ఎన్​పీఆర్​ ప్రక్రియ చేపడుతామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న బంగాల్​, కేరళ ముఖ్యమంత్రులకు దమ్ముంటే వారి రాష్ట్రాల్లో ఎన్​పీఆర్​ను​ అమలు చేయకూడదని సవాల్​ విసిరారు.

npr-update-in-bihar-to-begin-on-may-15-says-sushil-modi
బంగాల్​, కేరళ ముఖ్యమంత్రులకు 'మోదీ' సవాల్​..!

బంగాల్​, కేరళ ముఖ్యమంత్రులకు 'మోదీ' సవాల్​..!

కేంద్రం నిర్ణయం మేరకు జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​) చేపడుతామని తెలిపారు బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ. రాష్ట్రంలో మే 15 నుంచి 28 వరకు ఎన్​పీఆర్​ నమోదు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్​పీఆర్​ అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సుశీల్​.

''జాతీయ జనాభా పట్టిక-2020 నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా ఏప్రిల్​ 1 నుంచి సెప్టెంబర్​ 30 వరకు కొనసాగనుంది. బిహార్​లో మే 15-28 మధ్య చేపడతాం.''

- సుశీల్​ కుమార్​ మోదీ, బిహార్​ ఉప ముఖ్యమంత్రి

ఈ సందర్భంగా.. ఎన్​పీఆర్​ను వ్యతిరేకిస్తున్న బంగాల్​, కేరళ ముఖ్యమంత్రులకు సవాల్​ విసిరారు. దమ్ముంటే పౌరచట్టం, ఎన్​పీఆర్​ అమలును నిలిపేయాలని అన్నారు మోదీ. పౌరసత్వంపై చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్న ఆయన ఎన్​పీఆర్​.. తప్పనిసరి నిబంధన అన్నారు. ఏ రాష్ట్రానికీ జాతీయ జనాభా పట్టిక అమలును తిరస్కరించే అధికారం లేదని సుశీల్ మోదీ అన్నారు.

జాతీయ జనాభా పట్టిక.. ఎన్​ఆర్​సీ కోసమేనని కాంగ్రెస్​ సహా ప్రధాన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశీల్​ మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదీ చూడండి:ఎన్​ఆర్​సీ-ఎన్​పీఆర్​పై తొలగని సందేహాలు

ఎన్​పీఆర్​ అంటే..

దేశంలోని పౌరుల వివరాలు సేకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరవేయడమే ఎన్‌పీఆర్‌ లక్ష్యం. ఎన్‌పీఆర్​ సిద్ధమైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ)ను రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. 2021లో మరోసారి జనాభా గణన చేయనున్నారు ఇందుకోసం రూ. 8,754 కోట్లు కేటాయించింది. అంతకంటే ముందే 2020లోనే ఎన్​పీఆర్​ను రూపొందించనున్నారు.

అసోం మినహా దేశవ్యాప్తంగా ఎన్​పీఆర్​ను అమలు చేసి నిజమైన పౌరుల వివరాలు సేకరించేందుకు కేంద్రం రూ. 3,941 కోట్లు కేటాయించింది.

ఇదీ చూడండి:2020 ఏప్రిల్​ నుంచి 'జాతీయ జనాభా పట్టిక' ప్రక్రియ

Last Updated : Jan 5, 2020, 3:20 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details