తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మట్టి లేకుండా మొక్కల పెంపకం

మొక్కలను పెంచే అభిరుచి అతనికి జీననాధారం అయింది. మట్టి, రసాయనిక ఎరువులు వాడకుండా కొబ్బరి పీచు సహాయంతో మొక్కలను పెంచి రికార్డు సృష్టిస్తున్నాడు ఝార్ఖండ్​కు చెందిన యువకుడు.

ప్రమోద్​ కుమార్​కు

By

Published : Mar 17, 2019, 6:13 AM IST

మట్టి లేకుండా మొక్కల పెంపకం
మూడు వందల రకాల జాతుల మొక్కలు పెంచి రికార్డు సృష్టించాడు జార్ఖండ్​కు చెందిన యువకుడు. ఇందులో గొప్ప ఏముంది అనుకుంటున్నారా... మట్టి, రసాయనిక ఎరువులు వాడకుండా ఆ యువకుడు ఈ ఘనత సాధించాడు. అందుకే రికార్డయింది.

ఝార్ఖండ్​లోని బొకారోకు చెందిన ప్రమోద్​ కుమార్​కు చిన్న నాటి నుంచి మొక్కలు పెంచే అలవాటు ఉంది. 16 ఏళ్ల వయసు నుంచి ఇంట్లోని పెరట్లో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాడు​. ఈ అలవాటే... ఇప్పుడతడికి జీవనాధారం అయింది.

అరుదైన మొక్క పేరుతో ప్రసిద్ధి

ఆఫ్రికా, అరేబియన్​ దేశాల్లో అరుదుగా కనిపించే అడీనియం జాతి మొక్కలు ప్రమోద్​ వద్ద అధిక సంఖ్యలో లభిస్తాయి. అందుకే ఈ మొక్క పేరుపై 'అడీనియం అడ్డా' అనే పేరు వచ్చింది ప్రమోద్​ మొక్కల కేంద్రానికి.

మొదట్లో మొక్కల పెంపకం అభిరుచిగా ఉండేది. కాలానుగుణంగా దీనిపై ఆసక్తి పెరిగింది. ఇంటర్నెట్​ ద్వారా ప్రత్యేకమైన మొక్కల పెంపకంలో మెలకువలు నేర్చుకున్నాను. ప్రస్తుతం మొత్తం 300 జాతుల మొక్కల్ని పెంచుతున్నా. వాటిలో మూడు ప్రధానమైనవి.. అవి అడినియం,సుకలనై​ట్​, కాకటస్​ జాతులకు చెందినవి. పర్యావరణానికి ఉపయోగపడే సన్​సివిరియా ట్రైఫాసియాటా మొక్కల్ని కేంద్రంలో పెంచుతున్నాను - ప్రమోద్​ కుమార్​

అడీనియంను ఎడారి గులాబీ అని పిలుస్తారు. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోనే ఇవి మనుగడ సాగిస్తాయి. రంగురంగుల అందమైన పుష్పాలకు ఈ మొక్క ప్రసిద్ధి. డార్జిలింగ్​, కాలిమ్​పాంగ్​, థాయ్​లాండ్​లు అడినియం​ మొక్కలకు ప్రసిద్ధి. అయితే ఝార్ఖండ్​ బొకారోలోనూ ఎటువంటి వ్యాధులకు గురికాకుండా మొక్కలు పెరుగుతుండటం విశేషం.

మట్టి, ఎరువుల అవసరం లేదు

మొక్కల పెంపకానికి మట్టిని ఉపయోగించరు ప్రమోద్​. మట్టికి బదులు కొబ్బరి పీచును వినియోగిస్తారు.

రసాయనిక ఎరువుల బదులు సహజమైన వర్శీ కంపోస్ట్​ను ఉపయోగిస్తారు​. కుళ్లిన కూరగాయలు, రాలిపోయిన ఆకులు వర్శీ కంపోస్టు తయారీకి వాడతారు.

కాలుష్యానికి అడ్డుకట్ట వేసే మొక్క

బొరోలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని... కాలుష్యాన్ని తగ్గించే శక్తి ఉన్న సన్​సివిరియా ట్రేఫాసియాటా మొక్కలను కేంద్రంలో విరివిరిగా పెంచుతున్నారు ప్రమోద్​. గాలిని శుభ్రపరచటంలో దిట్ట ఆ మొక్కలు.

వ్యక్తిగత అభిరుచే తనకు జీవనాధారం అవడం సంతోషాన్ని కలిగిస్తుందని అంటున్నాడు ప్రమోద్​. ఈ మొక్కల కేంద్రం ద్వారా నెలకు రూ.30వేల వరకు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కేంద్రాన్ని విస్తరించే ఆలోచన ఉన్నాడు. ఈ కేంద్రం ద్వారా నలుగురికి ఉపాధి కల్పనతో పాటు, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషి ఎనలేని తృప్తినిస్తోందని ప్రమోద్​ చెబుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details