తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూకదాడులపై మోదీకి ప్రముఖుల లేఖ

దేశంలో ముస్లింలు, బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న మూకదాడులను వెంటనే అరికట్టాలని మోదీకి పలు రంగాల ప్రముఖులు లేఖ రాశారు. ప్రజాస్వామ్యం, నేరస్థులకు శిక్ష తదితర అంశాలను లేఖలో ప్రస్తావించారు.

By

Published : Jul 24, 2019, 3:11 PM IST

మూకదాడులపై మోదీకి ప్రముఖుల లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ రంగాల ప్రముఖలు బహిరంగ లేఖ రాశారు. దేశంలో ముస్లింలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న మూకదాడులను తక్షణమే అరికట్టాలని కోరారు.

'సమస్యను ఖండిస్తే సరిపోదు'

దర్శకులు శ్యామ్​ బెనగల్​, అపర్ణ సేన్​, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా 49 మంది ప్రముఖులు మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. 'జై శ్రీరామ్​' అన్న పదాన్ని ఇతరులను రెచ్చగొట్టేందుకు ఒక యుద్ధ నినాదంలా ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్​ వేదికగా మూకదాడులను మోదీ ఖండించడాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి అంశాలను కేవలం ఖండిస్తే సరిపోదన్నారు. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రధానిని ప్రశ్నించారు.

లేఖలోని మరిన్ని అంశాలు...

  • 2016లో ఎస్సీలపై దురాగతాలకు సంబంధించి దాదాపు 840 ఘటనలు జరిగాయి. నేరాల సంఖ్య పెరుగుతోంది. కానీ నేరస్థులకు శిక్ష పడే శాతం తగ్గిపోతోంది.
  • ఎన్నో వర్గాలకు రాముడు పవిత్ర దైవం. రాముని పేరు అగౌరవపరచడం ఆపండి.

అసమ్మతి లేనిదే ప్రజాస్వామ్యం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై జాతి వ్యతిరేకులు, నక్సలైట్లనే ముద్ర వేయకూడదు.

ఇదీ చూడండి:- కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..!

ABOUT THE AUTHOR

...view details