ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాలకున్న ఉగ్ర కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భగ్నం చేసింది. చెన్నై నాగపట్టణంలో విదేశీయులు కొందరు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు చేసేందుకు అన్సురులా అనే ఉగ్ర ముఠాను ఏర్పాటు చేశారని పేర్కొంది. వీరిపై జులై 9న కేసు నమోదైనట్లు తెలిపింది.
చెన్నైలో నివాసం ఉంటున్న సయ్యద్ మహ్మద్ బుఖారి, నాగపట్టణానికి చెందిన హసన్ అలీ యూనుస్మరికార్, మహ్మద్ యూసుఫుద్దీన్ హ్యారిస్ మహ్మద్, వారి సహాయకులు దేశంలో ఉగ్రదాడుల కోసం నిధులు సేకరించారని తెలిపింది ఎన్ఐఏ. ఇస్లామిక్ రాజ్యస్థాపన లక్ష్యంగా వారు ఉగ్రకుట్రకు ప్రణాళిక రచించారని వెల్లడించింది.