తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాపై పోరు సాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం'

కరోనాపై పోరును కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. లాక్​డౌన్ వల్ల వేల సంఖ్యలో ప్రజలను వైరస్ బారిన పడకుండా కాపాడినట్లు చెప్పారు. ఈ సమావేశంలో లాక్​డౌన్ పొడిగింపునకే ముఖ్యమంత్రులు మొగ్గు చూపినట్లు పేర్కొన్నారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి.

By

Published : Apr 27, 2020, 4:04 PM IST

modi
'కరోనాపై పోరు సాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం'

కరోనా వైరస్​ నియంత్రణకు విధించిన లాక్​డౌన్​ గడువు త్వరలో తీరిపోనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే వైరస్​పై పోరులో ముందుకు సాగాలని ఉద్ఘాటించారు. లాక్​డౌన్ విధించి ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు. లాక్​డౌన్ ఫలితాలు రాబోయే నెలల్లో కనిపిస్తాయని వెల్లడించారు. రాష్ట్రాలు ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాలని చెప్పారు మోదీ.

'కొనసాగింపునకే సీఎంల మొగ్గు'

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ విశేషాలను వెల్లడించారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. లాక్​డౌన్ కొనసాగింపునకే మెజార్టీ ముఖ్యమంత్రులు మొగ్గు చూపారని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలకు స్వల్పంగా అనుమతించాలని సీఎంలు మోదీకి విన్నవించినట్లు వివరించారు. అయితే ముఖ్యమంత్రుల వినతిపై ప్రధాని ఏ విధమైన వ్యాఖ్య చేయలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎంలు, ఆరోగ్య శాఖ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

'రెండో దశను తట్టుకునేలా'

జూన్, జులై నెలల్లో రెండోసారి వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రధాని తెలిపినట్లు చెప్పారు ఛత్తీస్​గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో. ముఖ్యమంత్రి తో కలిసి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న ఆయన రెండో దశ వైరస్ ముప్పును తట్టుకునేలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:ఉద్యోగుల రిటైర్మెంట్​ ఏజ్ తగ్గింపుపై కేంద్రం క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details