తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఈడీ పేలుడులో 15మంది జవాన్లకు గాయాలు

ఝార్ఖండ్​లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు నక్సల్స్. ఈ ఘటనలో 15 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.

By

Published : May 28, 2019, 9:09 AM IST

Updated : May 28, 2019, 11:59 AM IST

నక్సల్స్ బాంబు దాడిలో 11మంది కి గాయాలు

ఝార్ఖండ్​లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా నక్సల్స్​మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నలుగురిని హెలికాప్టర్​లో రాంచీకి తరలించారు. సరాయికేలా కర్సవాన్ జిల్లాలోని హుర్దా అటవీ ప్రాంతంలో సీఆర్​పీఎఫ్​ ప్రత్యేక దళం కోబ్రా, స్థానిక పోలీసులు కూంబింగ్ చేపట్టారు.ఈ బృందం లక్ష్యంగా ఉదయం 5 గంటల ప్రాంతంలో మందుపాతర పేల్చారు నక్సల్స్.

గాయపడిన వారిలో 13 మంది సీఆర్​పీఎఫ్ సిబ్బంది, మరో ఇద్దరు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వారున్నారు.

భద్రతా దళాలు ఘటనా స్థలిని అధీనంలోకి తీసుకున్నాయి. నక్సల్స్ వేట కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దోషులను శిక్షిస్తామన్నారు.

Last Updated : May 28, 2019, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details