తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"జేఈఎం దాడులు నిజమే"

జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థను పాక్ బహిష్కరించడం మంచి పరిణామమని పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ వ్యాఖ్యానించారు.

By

Published : Mar 8, 2019, 12:01 AM IST

ముషారఫ్

మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ తన హయాంలో రెండుసార్లు భారత్ పై దాడులకు పాల్పడిందని పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ తెలిపారు. అందుకోసం ఇంటలిజెన్స్​ సంస్థలను ఉపయోగించుకుందని ఆరోపించారు.

జేఈఎంపై పాకిస్థాన్ నిషేధం విధించడం మంచి పరిణామమని.. తన హయాంలోనే తననే రెండుసార్లు హత్య చేయాడానికి ఈ ఉగ్రసంస్థ ప్రయత్నించిందని తెలిపారు.
మసూద్ పాక్ లోనే ఉన్నాడని.. కానీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేమని, భారత్ ఒకవేళ పటిష్టమైన ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమని గత నెల పాక్ విదేశాంగ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.

పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పాక్ ప్రభుత్వం జేఈఎంకు చెందిన 44 మందిని బహిష్కరించింది. ఇందులో మసూద్ సోదరుడు, తనయుడు కూడా ఉన్నారు.

మీరు అధికారంలో ఉండగా ఎందుకు జేఈఎంను నిషేధించలేదన్న ప్రశ్నకు.. అప్పటి పరిస్థితులు వేరని.. ఆ కాలంలో భారత్‌, పాక్‌లు రహస్యంగా పోరాడేవని వ్యాఖ్యానించారు. ఇందుకోసం పాక్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలు పనిచేసేవని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details