తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్మీ వాహనాలపై ఎంపీల ఆసక్తి..

పార్లమెంటు సభ్యులకు సైన్యం వినియోగించే వాహనాలపై మనసు మళ్లింది. భద్రతా బలగాలు వినియోగించి పక్కన పెట్టేసిన వాహనాలపై ఎంపీలు ఆసక్తి చూపిస్తున్నారు. 2017,18లలో ఇలాంటి వాహనాల కోసం 36 మంది ఎంపీలు దరఖాస్తు చేసుకున్నారు.

By

Published : Jul 3, 2019, 5:16 AM IST

ఆర్మీ వాహనాలపై ఎంపీల ఆసక్తి..

భారత పార్లమెంటు సభ్యులు ఆర్మీ వాహనాలపై అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. భద్రతా దళాలు పూర్తిగా వినియోగించి, పక్కన పెట్టేసిన వాహనాల కోసం వీరి నుంచి దరఖాస్తులు పెరిగిపోతున్నాయి. 2017,18లలో ఆ వాహనాల కోసం దాదాపు 36 మంది పార్లమెంటు సభ్యులు దరఖాస్తు చేసుకున్నారంటేనే అర్థమవుతోంది.

దీనికి సంబంధించిన సమాచారాన్ని.. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్​ రాజ్యసభలో మంగళవారం లిఖితపూర్వకంగా వెల్లడించారు.

పూర్తిగా వినియోగించిన వాహనాలు తక్కువ ధరకు లభిస్తున్న కారణంతో.. ఎంపీలు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ఎక్కువగా మారుతీ జిప్సీ, మహీంద్రా జీపులు, రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్లు ఉన్నాయి.

వేలం ద్వారా...

భారత సైన్యం విధి విధానాల ప్రకారం కాలం చెల్లిన వాటిని పక్కన పెడతారు. కొత్తవి వచ్చే వరకు ఆ వాహనాలను ఆర్డినెన్స్​ యార్డులో భద్రపరుస్తారు. అనంతరం.. వేలం ప్రక్రియ ద్వారా వీటిని విక్రయిస్తారు. ఇందులో సాధారణ ప్రజలూ పాల్గొనవచ్చు.

వెహికిల్​ డిపోల నుంచి ఒక్కో వాహనాన్ని దరఖాస్తు చేసుకున్న ఎంపీలకు కేటాయించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి.

ABOUT THE AUTHOR

...view details