తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడేళ్ల కూతురి గొంతు కోసి.. తల్లి ఆత్మహత్య!

మహారాష్ట్రలో నవమాసాలు కడుపున మోసిన తల్లే.. కన్నబిడ్డ పాలిట కర్కశంగా వ్యవహరించింది. కత్తితో ఏడేళ్ల కూతురి గొంతు కోసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By

Published : Jun 12, 2020, 12:34 PM IST

Mother killed daughter by slitting her throat, then committed suicide in same way
ఏడేళ్ల కూతురి గొంతు కోసి చంపిన తల్లి ఆత్మహత్య!

మమతలు పంచే ఓ తల్లి మనసు కర్కశంగా మారింది. ఆపదొస్తే అక్కున చేర్చుకోవాల్సిన అమ్మే క్షణికావేశంతో కన్నకూతురిని కడతేర్చింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ఠానె, బద్లాపుర్​కు చెందిన ఓ పోలీసు అధికారి భార్య మీనాబాయి అశోక్ పాటిల్. గురువారం మీనాబాయి బెడ్​రూమ్​లో నిద్రపోయే సమయానికి తన ఏడేళ్ల కూతురు కీర్తిక హాల్​లో నాయనమ్మ కేవడ్​బాయి దగ్గర పడుకుంది. రాత్రి 11.30 గంటలకు కీర్తికను తన గదిలోకి లాక్కెళ్లింది మీనా. కొద్దిసేపటి తర్వాత గదిలోంచి అరుపులు, శబ్దాలు వినబడ్డాయి. నాయనమ్మ కేవడ్​బాయి పరుగెత్తుకెళ్లింది. కోడలు, మనవరాలు రక్తపు మడుగులో పడిఉండడం చూసి నిర్ఘాంతపోయింది.

ఏడేళ్ల కీర్తిక...

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మీనా ముందుగా కీర్తి గొంతు కోసి, ఆ తర్వాత తాను అదే కత్తితో కోసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి, ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

ఇదీ చదవండి:'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్​!

ABOUT THE AUTHOR

...view details