తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైట్లీ పరిస్థితి విషమం.. ఎయిమ్స్​కు ప్రముఖులు

కేంద్ర మాజీ అర్థిక మంత్రి, భాజపా సీనియర్​ నేత అరుణ్​ జైట్లీ ఆరోగ్యంపై ఆరా తీసేందుకు రాజకీయ ప్రముఖలు ఎయిమ్స్​ తరలివెళ్తున్నారు. ఆగస్టు 9 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జైట్లీ. పరిస్థితి విషమించినట్లు వైద్యులు తెలిపారు.

By

Published : Aug 18, 2019, 7:53 PM IST

Updated : Sep 27, 2019, 10:40 AM IST

ఎయిమ్స్​కు రాజకీయ ప్రముఖులు.. జైట్లీ పరిస్థితిపై ఆరా

భాజపా సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, స్మృతీ ఇరానీ, రామ్ విలాస్ పాశవాన్​ సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిల్లీలోని ఎయిమ్స్​ను ఆదివారం సందర్శించారు. జెట్లీ ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్​కు వెళ్లిన వారిలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ కూడా ఉన్నారు.

అనారోగ్యంతో ఆగస్టు 9న ఎయిమ్స్​లో చేరారు జైట్లీ. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ఇదివరకే తెలిపారు.ప్రస్తుతం ఆయనను లైఫ్​ సపోర్ట్ సిస్టమ్​పై ఉంచారు.

Last Updated : Sep 27, 2019, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details