తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాబిల్లి ఫొటోను పంపిన చంద్రయాన్​-2

భారత్​ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్​-2.. చంద్రుని తొలి ఫొటోను తీసి పంపింది. చంద్రునికి సుమారు 2,600 కిలోమీటర్ల దూరం నుంచి ఈ చిత్రాన్ని తీసింది.

By

Published : Aug 22, 2019, 11:45 PM IST

Updated : Sep 27, 2019, 10:42 PM IST

జాబిల్లి ఫొటోను పంపిన చంద్రయాన్​-2

జాబిల్లికి అతి దగ్గరగా చేరింది చంద్రయాన్​-2. చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తోన్న రోవర్​ తాజాగా పంపిన చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. చంద్రుడి ఫొటోను 2,600 కిలోమీటర్ల దూరం నుంచి తీసి పంపింది విక్రమ్​ ల్యాండర్​.

ఈ చిత్రంలో చంద్రుడి దక్షిణార్ధగోళంలో ఉన్న అపోలో క్రేటర్స్‌ బిలం, పశ్చిమ అంచులో ఉన్న మేర్‌ ఓరియంటేల్‌ అనే మరొక పెద్ద బిలాన్ని ఇస్రో గుర్తించింది.

చంద్రయాన్‌-2 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం దీర్ఘవృత్తాకారంగా తిరుగుతున్న దశలో ఉపగ్రహ కక్ష్యను బుధవారం మరింత తగ్గించారు. సెప్టెంబర్‌ 7న చంద్రునిపైకి ల్యాండర్‌ దిగనున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో 20 నిమిషాల పాటు ఇంజిన్లను మండించి కక్ష్యను కుదించారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2 ముందున్న అసలు సవాలు అదే..!

Last Updated : Sep 27, 2019, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details