తెలంగాణ

telangana

ETV Bharat / bharat

28 నుంచి మోదీ ప్రచార శంఖారావం

లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో భాజపా సభలకు ఆయన హాజరవుతారు.

By

Published : Mar 27, 2019, 12:01 AM IST

28 నుంచి భాజపా ఎన్నికల ప్రచారంలో మోదీ

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి భాజపా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 28నుంచి రెండు రోజుల పాటు మెదటి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటిస్తారు.

28న ఉత్తర ప్రదేశ్​లోని మీరట్, ఉత్తరాఖండ్​లోని రుద్రాపూర, జమ్మూలో జరిగే భాజపా ప్రచార సభలకు హాజరవుతారు.

29న ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.


ఇదీ చూడండి :జోషికి దక్కని టికెట్.. వరుణ్​, మేనక స్థానాల మార్పు

ABOUT THE AUTHOR

...view details