తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"యూపీఏలో రాహుల్​ సంస్థకు జలాంతర్గామి ఒప్పందం"

లండన్​లో రాహుల్​ గాంధీకి చెందిన ఓ సంస్థకు కాంగ్రెస్ గతంలో జలాంతర్గామి ఒప్పందాన్ని కట్టబెట్టిందని ఆరోపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్​ సాగర్​లో జరిగిన  బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రిమోట్​ కంట్రోల్​ పాలనైనా, రిమోట్​తో వీడియే గేమ్​ ఆటలోనైనా కాంగ్రెస్​కు సాటి ఎవరూ లేరని దుయ్యబట్టారు.

By

Published : May 5, 2019, 7:26 PM IST

"రాహుల్​ సంస్థకు జలాంతర్గామి ఒప్పందాన్ని కట్టబెట్టారు"

కుటుంబ ప్రయోజనాల కోసం దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించి.. ప్రజలకు సొంత ఇళ్లు కూడా కల్పించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 నాటికి ఆ పనిని భాజపా చేసి చూపిస్తుందన్నారు. మధ్యప్రదేశ్​లోని సాగర్​లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ.

తనను నటుడన్న కాంగ్రెస్ విమర్శలపై ధీటుగా స్పందించారు మోదీ. రిమోట్ కంట్రోల్​తో దేశాన్ని పాలించిన వారిముందు ఎవరైనా దిగదుడుపేనని ఎద్దేవా చేశారు.
రాహుల్​ గాంధీకి చెందిన లండన్​లోని ఓ సంస్థకు కాంగ్రెస్ హయాంలో రక్షణ శాఖకు సంబంధించిన జలాంతర్గామి ఒప్పందాన్ని కట్టబెట్టారని ఆరోపించారు మోదీ. దానిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్​పై మోదీ ఆరోపణలు

" పేరు గొప్ప వ్యక్తి(రాహుల్​ గాంధీ)కి ఇంగ్లండ్​లో ఓ సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు ఆయన చేష్టలకు సరిపోయేలానే ఉంటుంది. ఆ సంస్థ పేరు బ్యాకప్స్​​. అంటే బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్. వాళ్లు పనులన్నీ తెరవెనుకే నిర్వహిస్తారు. 2009లో దాన్ని మూసేశారు. అయినా 2011లో ఆ సంస్థలో భాగస్వామికి జలాంతర్గామి ఒప్పందం లభించింది. ఆ సమయంలో వారే అధికారంలో ఉన్నారు. సంస్థ వాళ్లదే. సంస్థలో పనిచేసేవారు వాళ్లకి సన్నిహితులు.." -నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: మోదీ.. మీరు తప్పించుకోలేరు :రాహుల్​ గాంధీ

ABOUT THE AUTHOR

...view details