తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ది కీలుబొమ్మ సర్కార్​: మోదీ

కాంగ్రెస్​ పాలనతో దేశానికి ఒరిగిందేమీ లేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. అధికారం కోసం చిరకాల ప్రత్యర్థులు ఏకమయ్యారని, అటువంటివారిని నమ్మొద్దని ఎస్పీ, బీఎస్పీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

By

Published : Apr 27, 2019, 2:56 PM IST

నరేంద్రమోదీ

కాంగ్రెస్​ అధికారంలో ఉండగా కొందరి చేతుల్లోనే రిమోట్​ కంట్రోల్​ ఉండేదని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. ఉత్తరప్రదేశ్ హర్దోయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... మహాకూటమిపై విరుచుకుపడ్డారు. ఎస్పీ, బీఎస్పీపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"2014 ముందు కీలు బొమ్మ ప్రభుత్వం ఉండేది. అప్పుడు రెండు మొబైల్​ ఫోన్​ తయారీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు కేవలం ఐదేళ్లలో 125పైగా కర్మాగారాలు ఫోన్లు తయారు చేస్తున్నాయి. 2016 ఏప్రిల్​ 14న బాబాసాహెబ్​ అంబేడ్కర్​ జన్మదినం సందర్భంగా నవభారతంలో నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అంబేడ్కర్​ పేరు మీద 'భీమ్​ యాప్​'ను విడుదల చేశాం. "
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: 'అవకాశవాదుల పొత్తు చిత్తవడం ఖాయం'

ABOUT THE AUTHOR

...view details