తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2020, 7:01 PM IST

Updated : Feb 29, 2020, 4:19 AM IST

ETV Bharat / bharat

'మోదీ- కేజ్రీవాల్​కు ఆ సమస్యలు పట్టవు'

దిల్లీలోని జంగ్​పురలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. భాజపా, ఆప్​ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. నిరుద్యోగ సమస్యలు మోదీ- కేజ్రీవాల్​కు పట్టవని ఆరోపించారు. వారి ఆలోచన అంతా అధికారం గురించేనని దుయ్యబట్టారు రాహుల్​.

Modi, Kejriwal not interested in jobs for youngsters: Rahul
'మోదీ- కేజ్రీవాల్​కు ఆ సమస్యలు పట్టవు'

'మోదీ- కేజ్రీవాల్​కు ఆ సమస్యలు పట్టవు'

దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​కు ఏమాత్రం పట్టదని ఆరోపించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. భారతీయుల మధ్య చిచ్చుపెట్టడంపైనే వారి దృష్టి ఉందని విమర్శించారు.

దిల్లీలోని జంగ్​పుర నియోజకవర్గం కాంగ్రెస్​ అభ్యర్థి తర్విందర్​ సింగ్​ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్​. మోదీ-కేజ్రీవాల్.. అధికార దాహంతో ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

"నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. రెండు కోట్ల మంది భారత యువతకు ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు వచ్చాయా? దిల్లీలో ఆమ్​ ఆద్మీ పార్టీ... నిరుద్యోగ సమస్యపై స్పందించిందా? లేదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. దేశంలోని కోట్లాది మంది యువత ఏదీ ఉచితంగా ఆశించడం లేదు. కేవలం ఉద్యోగాలు కావాలంటున్నారు. కానీ ఇవేవీ నరేంద్ర మోదీ, అరవింద్​ కేజ్రీవాల్​కు పట్టవు. కేవలం ద్వేషపూరిత ప్రసంగాలే వారికి వచ్చు. ఇద్దరు భారతీయుల మధ్య చిచ్చుపెట్టడమే తెలుసు. వారి ఆలోచన అంతా అధికారం గురించే."
-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత.

దేశంలో రోజురోజుకు గాడి తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దకుండా.. హింసను ప్రరేపించడమేంటని భాజపాను నిలదీశారు రాహుల్.

పాకిస్థాన్​లో 'హిందుస్థాన్​ జిందాబాద్​' అంటూ నినాదాలు చేసిన ఒక్క భాజపా నేతను చూపించమన్నారు రాహుల్​. కాంగ్రెస్ నేత తర్విందర్​.. పాక్​కు వెళ్లి ఎంతో ధైర్యంగా భారత అనుకూల నినాదాలు చేశారని.. ఆయనను జైలులో పెట్టినా బెదరలేదని ప్రశంసించారు.

Last Updated : Feb 29, 2020, 4:19 AM IST

ABOUT THE AUTHOR

...view details