తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమత సత్యాగ్రహం ప్రారంభం

పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెట్రో ఛానల్​ వద్ద "ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం" ధర్నా చేపట్టారు. దీన్ని ఆమె సత్యాగ్రహంగా అభివర్ణించారు.

By

Published : Feb 3, 2019, 10:12 PM IST

మమతా బెనర్జీ

'ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ కోల్​కతాలోని మెట్రో ఛానల్​ వద్ద ధర్నా ప్రారంభించారు. దీన్ని ఆమె 'సత్యాగ్రహం'గా అభివర్ణించారు. ఈ ధర్నాలో పోలీస్​ కమిషనర్​ రాజీవ్​కుమార్​, తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు.

భాజపా సీబీఐని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంపై దాడులకు పురిగొల్పుతోందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసమే సత్యాగ్రహం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.

ధర్నాలో కూర్చున్న మమతా బెనర్జీ, తృణమూల్​ నేతలు

ABOUT THE AUTHOR

...view details