తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మిజోరంలో తొలి కరోనా మరణం నమోదు

మిజోరంలో కొవిడ్​ కారణంగా మొదటి మరణం నమోదైంది. ఇప్పటివరకు వైరస్​ కారణంగా ఒక్కరు కూడా మృతి చెందకపోగా బుధవారం ఓ వృద్ధుడు ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.

By

Published : Oct 28, 2020, 3:33 PM IST

Mizoram reports first COVID-19 fatality
మిజోరంలో తొలి కరోనా మరణం నమోదు

మిజోరంలో కరోనాతో మొట్టమొదటి మరణం నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. పది రోజులుగా వైరస్​తో పోరాడిన 62ఏళ్ల వ్యక్తి బుధవారం చనిపోయినట్లు తెలిపారు.

మిజోరంలో మొదటి కేసును మార్చి 24న అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పలు మార్లు పూర్తి స్థాయి లాక్​డౌన్​ అమలు చేశారు. మరికొన్ని సార్లు పాక్షికంగా విధించారు.

ఇప్పటివరకు మిజోరంలో మొత్తం కేసుల సంఖ్య 2,607గా ఉంది. బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: భారత్​లో మరో 43,893 కేసులు, 508 మరణాలు

ABOUT THE AUTHOR

...view details