తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుప్పకూలిన మిగ్-పైలట్​ క్షేమం

భారత్-పాక్​ సరిహద్దు వద్ద మిగ్​-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ​రాజస్థాన్​ బికనీర్‌కు సమీపంలోని శోభాసర్‌ ప్రాంతంలో  ఈ దుర్ఘటన జరిగింది.

By

Published : Mar 8, 2019, 5:32 PM IST

Updated : Mar 8, 2019, 6:34 PM IST

MIG-21

రాజస్థాన్​ బికనీర్​కు సమీపంలోని శోభాసర్​ ప్రాంతంలో మిగ్​-21 యుద్ధ విమానం కుప్పకూలింది. పైలట్‌ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లోని నాల్‌ ఎయిర్‌బేస్‌కు మిగ్‌ 21ను ఐఏఎఫ్‌ తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

కూలిన మిగ్​-21 యుద్ధ విమానం

మిగ్​-21 కూలినట్లు బికనీర్​ కలెక్టర్ ధ్రువీకరించారు. భారత్​-పాక్​ మధ్య పుల్వామా ఉగ్రదాడి అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. పరిస్థితులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మిగ్​-21 భారత్​-పాక్​ సరిహద్దులో కూలింది.
సైన్యం, వాయుసేన అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Last Updated : Mar 8, 2019, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details