తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే వేదికపై ములాయం- మాయావతి

పరస్పర వ్యూహాలు.. రాజకీయ ఎత్తుగడలతో రాష్ట్రంలో అధిపత్యం, అధికారం కోసం ఎన్నో ఏళ్లు సమరం సాగించిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే వేదికను పంచుకోనున్నారు. భాజపా పతనమే లక్ష్యంగా కలిసి ప్రచారం చేయనున్నారు. వారే సమాజ్​వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్​ యాదవ్​, బహుజన్​ సమాజ్​పార్టీ అధినేత్రి మాయావతి. ఉత్తర్​ప్రదేశ్​లోని మెయిన్​పురి వీరి కలయికకు వేదిక కానుంది.

By

Published : Apr 19, 2019, 8:52 AM IST

Updated : Apr 19, 2019, 4:05 PM IST

ఒకే వేదికపై ములాయం- మాయావతి

ఒకే వేదికపై ములాయం- మాయావతి

ఉత్తరప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​, బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి నేడు ఒకే వేదికను పంచుకోనున్నారు. మెయిన్​పురిలో జరగనున్న ర్యాలీలో వీరుద్దరు పాల్గొననున్నారు.

ఎస్​పీ- బీఎస్​పీ కూటమి ఐకమత్యాన్ని ప్రత్యర్థులకు చాటిచెప్పేందుకు ఈ ర్యాలీ ఏర్పాటు చేసినట్టు కూటమి వర్గాలు స్పష్టం చేశాయి.

1995 నుంచి వ్యూహాలతో రాజకీయంగా కత్తులు దూసుకున్న ఈ అగ్ర పార్టీలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఒక్కటయ్యాయి.

దేవ్​బంద్​, బదావ్, ఆగ్రాల్లో కూటమి నిర్వహించిన సభలకు ములాయం గైర్హాజరయ్యారు. మెయిన్​పురి ర్యాలీలోనూ పాల్గొనడానికి ఆయన సముఖంగా లేకపోయినప్పటికీ... తనయుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్​ యాదవ్​ ఆయనను ఒప్పించారని సమాచారం.

ఇరు పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కూటమి విజయానికి తోడ్పడాలని ఇప్పటికే బీఎస్​పీ కార్యకర్తలకు మాయావతి పిలుపునిచ్చారు.

ఇదీ చూడిండి: 'జెట్​ను నిలబెట్టి మమ్మల్ని కాపాడండి'

Last Updated : Apr 19, 2019, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details