తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఔరా: పిచ్చుకల కోసం 'ఉచిత ఇళ్ల పథకం'

పిచ్చుకులంటే ఇష్టపడని వారుండరు. ప్రస్తుతం వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పిచ్చుకల సంరక్షణకు తమిళనాడు నాగపట్టణానికి చెందిన ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేపట్టాడు. ప్రత్యేకంగా ఇళ్లను నిర్మించి ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.

By

Published : Aug 21, 2019, 7:14 PM IST

Updated : Sep 27, 2019, 7:30 PM IST

ఔరా: పిచ్చుకల కోసం 'ఉచిత ఇళ్ల పథకం'

సాంకేతికతతో ప్రపంచం ఎంతో ముందుకు వెళుతోంది. కానీ ఆ వెంటే వస్తున్న కాలుష్య భూతం కారణంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పిచ్చుకలు కనిపించే పరిస్థితులు లేవు. ఆ చిన్ని పక్షులను రక్షించాలని సంకల్పించుకున్నాడు ఓ వ్యక్తి.

ఔరా: పిచ్చుకల కోసం 'ఉచిత ఇళ్ల పథకం'

శరవణన్... తమిళనాడు నాగపట్టణం వాసి. 'విళుతు ఐయ్యక్కమ్​' పేరిట సామాజిక సంస్థ నిర్వహిస్తారు. పిచ్చుకల సంరక్షణకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

పిచ్చుకలు నివాసం ఉండేలా కలపతో చిన్న చిన్న ఇళ్లు తయారు చేయిస్తున్నారు శరవణన్​. వాటిని ఉచితంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు పంపిణీ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

ఔరా: పిచ్చుకల కోసం 'ఉచిత ఇళ్ల పథకం'

ఇదీ చూడండి: ఈ పావురం 1750 కి.మీ. పయనించి గిఫ్ట్ కొట్టేసింది!

Last Updated : Sep 27, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details