తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''మధ్యతరగతి కలల్ని​ అణచివేస్తున్నారు''

పశ్చిమబంగ అభివృద్ధిలో తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ నిర్లక్షంగా వ్యవహరిస్తుందని మోదీ ఆరోపించారు.

By

Published : Feb 2, 2019, 7:10 PM IST

మధ్యతరగతి ప్రజల కలలను తృణమూల్​ అణచివేస్తోంది: మోదీ

మధ్యతరగతి ప్రజల కలలను తృణమూల్​ అణచివేస్తోంది: మోదీ
"నాలుగున్నరేళ్లలో పశ్చిమబంగా వికాసం కోసం, ఇక్కడి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం బడ్జెట్​లో చాలా నిధులు కేటాయించాం. కానీ ఇక్కడి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం కొంచెమైనా లేదు. సిండికేట్లకు వాటాలు లేని ప్రాజెక్టులను తృణముల్​ కాంగ్రెస్​ పార్టీ పట్టించుకోదనే నిజం ప్రపంచమంతా తెలుసు. పశ్చిమబంగాను అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయం... వికాసాన్ని అడ్డుకునే ప్రభుత్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు నెరవేరదు."

---- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

పశ్చిమబంగాలోని మధ్యతరగతి ప్రజల కలలను తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అణచివేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దుర్గాపుర్​లోని భాజపా సభలో ప్రసంగించిన మోదీ మమత బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

"తృణముల్​... టోలిబాజి(బెదిరింపులు).. టాక్స్​" వంటి మూడు 'టీ'లకు మమత ప్రభుత్వం ప్రసిద్ధి అని మోదీ విమర్శించారు. గత కమ్యూనిస్టు ప్రభుత్వాల మాదిరే తృణమూల్​ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆరోపించారు.

నాలుగున్నరేళ్లలో రూ. 90కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం ఆమోదించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రధాని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details