తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ విధ్వంసమే దీదీ అజెండా: మోదీ

బంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్రమోదీ. కుటిల నీతితో బంగాల్​ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బషీర్​హాట్​ బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ.

By

Published : May 15, 2019, 7:16 PM IST

Updated : May 15, 2019, 7:48 PM IST

మోదీ

మోదీ-దీదీ వార్​

కోల్​కతాలో మంగళవారం భాజపా అధ్యక్షుడు అమిత్​ షా రోడ్​షోను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

బంగాల్​లోని బషీర్​హాట్​ ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు.

"దీదీ గూండాలు తుపాకులు, బాంబులతో విధ్వంసం సృష్టిస్తున్నారు. మమత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది. ఈ కుటిల పాలనపై ప్రజలు ధైర్యంగా ఎదురు తిరుగుతారు. బంగాల్​లో భాజపా ఎదుగుదల చూసి దీదీ భయపడుతున్నారు. అధికార దాహంతో ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు. మీరు చేస్తున్న తప్పులను దేశమంతా గమనిస్తోంది.

రెండు రోజుల క్రితం నాపై ప్రతీకారం తీర్చుకుంటానని మమత శపథం చేశారు. నిన్న అమిత్​ షా రోడ్​ షోను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. మహిళలను జైలుకు పంపిస్తున్నారు. వాళ్లే మీకు తగిన గుణపాఠం చెబుతారు. ఒక చిన్న ఫొటో కోసం ఈ స్థాయిలో కోపాన్ని ప్రదర్శిస్తారా?"

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: కోల్​కతాలో అమిత్​షా కాన్వాయ్​పై రాళ్లదాడి

Last Updated : May 15, 2019, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details