తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరల్: మంత్రి పయనం.. సహాయానికా? విహారయాత్రకా?

మహారాష్ట్ర వరద బాధితులకు సహాయం చేసేందుకు వెళ్లిన ఓ మంత్రి వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. కోల్హాపుర్, సంగ్లీల్లో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సెల్ఫీ వీడియో తీసుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

By

Published : Aug 10, 2019, 5:27 AM IST

Updated : Aug 10, 2019, 8:53 AM IST

వైరల్: 'వరద బాధితుల సహాయమా-విహారయాత్రా?'

మహారాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి గిరీశ్ మహాజన్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వరద బాధితులకు పరామర్శ సందర్భంగా ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. రాష్ట్రమంతా వరదలతో అతలాకుతలం అవుతుంటే విహార యాత్రలా.. మంత్రి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

వైరల్: 'వరద బాధితుల సహాయమా-విహారయాత్రా?'

ఇదీ జరిగింది..

వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనలో భాగంగా సంగ్లీ, కోల్హాపుర్ జిల్లాలను సందర్శించారు మంత్రి గిరీశ్ మహజన్. బాధితులను పరామర్శించే సందర్భంలో ఓ బోటులో సహచరులతో కలిసి సెల్ఫీ వీడియో దిగారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బయటపడ్డాయి. ఫలితంగా గిరీశ్​పై విమర్శలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి.

ప్రతిస్పందన

మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న వీడియోపై గిరీష్​ మహాజన్​ స్పందిస్తూ 'చాలా మంది నాతో స్వీయ చిత్రాలు తీసుకోవాలనుకుంటారు. వాళ్లందరికి నేను కాదని చెప్పలేను. ప్రస్తుతం అక్కడ సమస్య ఉంది. ప్రజలు బాధల్లో ఉన్నారని' అన్నారు.

ఇదీ చూడండి:అక్టోబర్​ 31 నుంచి యూటీలుగా జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​

Last Updated : Aug 10, 2019, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details