తెలంగాణ

telangana

By

Published : Jan 21, 2021, 10:07 PM IST

ETV Bharat / bharat

మహారాష్ట్రలో 20లక్షలు దాటిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే దేశవ్యాప్తంగా.. వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య గురువారంతో 20 లక్షల మార్కును దాటింది.

maharashtra reached 20 lakh covid cases mark
20 లక్షల మార్కును దాటిన మహారాష్ట్ర

దేశంలో కరోనా ధాటికి ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్రలో.. వైరస్​ కేసుల సంఖ్య 20లక్షల మార్కును దాటింది. గురువారం రాష్ట్రంలో 2,886 మంది వైరస్​ బారిన పడగా 52 మంది మృతిచెందారని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 20,08,878
  • మరణాలు: 50,634
  • క్రియాశీల కేసులు: 45,622
  • కోలుకున్న వారు: 19,03,408
  1. దేశ రాజధాని దిల్లీలో మరో 227 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,33,276కు చేరింది. వైరస్​ నుంచి 246 మంది కోలుకున్నారు. మరో 8 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
  2. కర్ణాటకలో కొత్తగా 674మందికి కరోనా సోకింది. దీంతో వైరస్​ బారినపడిన వారి సంఖ్య 9,34,252కు చేరింది. మరో ఇద్దరు చనిపోయారు. 815 మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
  3. రాజస్థాన్​లో కరోనా బాధితుల సంఖ్య 3,16,081కి చేరింది. కొత్తగా 265మందికి వైరస్​ సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 2756కి పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details