తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2019, 5:21 AM IST

ETV Bharat / bharat

రైతన్న మమకారం: బసవన్నకు అంతిమ సంస్కారం!

ఎద్దులేనిదే ఎవుసం లేదంటారు. అనాదిగా రైతన్న శ్రమను పంచుకున్నది బసవన్నే. కాలం యాంత్రికమయంగా మారుస్తున్నా... రైతన్నకు  మమకారం పశుసంపదపైనేనని మధ్యప్రదేశ్​లోని ఓ రైతు నిరూపిస్తున్నాడు. ఎద్దు పట్ల తను చూపిన ప్రేమ, పశువుల పట్ల రైతుకుండే మమకారాన్ని కళ్లకు కడుతోంది.

రైతన్న మమకారం: బసవన్నకు అంతిమ సంస్కారం!

రైతన్న మమకారం: బసవన్నకు అంతిమ సంస్కారం!

మధ్యప్రదేశ్​ మంద్​​సర్​లోని ఉమ్రావ్​ సింగ్​ ప్రియమైన ఎద్దు ఇటీవలే మరణించింది. హిందూ ధర్మం ప్రకారం తోటి కుటుంబసభ్యునికి చేసినట్లే, ఊరందరినీ పిలిచి ఎద్దుకు 13 రోజుల కర్మకాండ నిర్వహించాడు ఆ రైతు.

సింగ్​ ప్రాణంగా పెంచుకున్న ఎద్దు పేరు 'రెండా'. వారిద్దరిదీ​ 18 ఏళ్ల అనుబంధం.. ఈ మధ్యే వయోభారంతో రెండా మృతి చెందింది. ఎద్దు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు​ కుటుంబ సభ్యులు. రెండా కర్మకాండలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు వారు. పుట్టెడు దుఃఖంతో ఆహ్వాన ప్రతులను ముద్రించి బంధువులందరినీ విందుకు ఆహ్వానించారు.

" ఈ ఎద్దును నేను సంతలో కొన్నాను. అప్పడు నేను చాలా పేదవాడిని. ఎద్దును కొన్నాక, నాకు అదృష్టం కలిసొచ్చింది. పంటలు బాగా పండాయి. పొలాలు కొన్నాను. రెండాను మా కుటుంబసభ్యుడిగా భావించేవాళ్లం. అందుకే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం."

-ఉమ్రావ్​ సింగ్​, ఎద్దు యజమాని

ఈ ఆధునిక యుగంలో సాటి మనుషులకే విలువ ఇవ్వడం లేదు.. అలాంటిది ఓ ఎద్దును ఇంతలా ప్రేమించడం.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎద్దు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన విషయం గుర్తు పెట్టుకుని ఇలా మమకారం చాటి చెప్పడం చాలా అరుదు.

ఇదీ చూడండి:నదిలో దూకి బాలికను కాపాడిన జవాన్లు

ABOUT THE AUTHOR

...view details