తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తీవ్ర చలిలోనూ చైనాను ఎదుర్కొనేందుకు సైనికులు సిద్ధం'

చైనా దురాక్రమణలను తిప్పికొట్టేందుకు తూర్పు లద్ధాఖ్​లో భారీగా బలగాలను మోహరిస్తోంది భారత్​. అయితే.. రానున్న శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్​ డిగ్రీలకు పడిపోతాయి. అయినప్పటికీ సైనికుల పరిస్థితిపై ఆందోళన అవసరం లేదంటున్నారు డీఆర్​డీఓ ఛైర్మన్​ సతీష్​ రెడ్డి. తీవ్రమైన చలిని ఎదుర్కొని మంచుకొండల్లో పోరాడేందుకు అవసరమైన చాలా సాంకేతికతలను ఇప్పటికే అభివృద్ధి చేసి.. వినియోగిస్తున్నట్లు చెప్పారు.

By

Published : Sep 4, 2020, 7:45 AM IST

DRDO chief
'తీవ్రమైన చలిలోనూ చైనాను ఎదుర్కొనేలా సైనికులు సిద్ధం'

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణలకు పాల్పడుతున్న క్రమంలో భారీగా బలగాలను మోహరిస్తోంది భారత్​. రానున్న శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్​ డిగ్రీలకు పడుపోనున్న క్రమంలో జవాన్ల పరిస్థితి, సైనిక సన్నాహాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంచుకొండల్లో ఎముకలు కొరికే చలిని సైతం తట్టుకునేలా చాలా సాంకేతికతలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు డీఆర్​డీఓ ఛైర్మన్​ జీ సతీష్​ రెడ్డి. వాటన్నింటినీ సాయుధ దళాలు వినియోగిస్తున్నాయని తెలిపారు. శీతాకాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైనికులు పోరాడేందుకు అవి ఉపయోగపడతాయని తెలిపారు.

ఇండియా ఫౌండేషన్​ నిర్వహించిన వెబినార్​లో ఈ మేరకు డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన సాంకేతికతలపై వెల్లడించారు సతీష్​ రెడ్డి.

"ఉత్తర పర్వతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్​లోకి పడిపోయి విపరీతంగా మంచు కురుస్తుంది. అందుకు తగిన విధంగా చాలా సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేశాం. సైనికులకు అవసరమైన దుస్తులు, బూట్లు, వేడిని పుట్టించే వస్తువులు, ఆహారాన్ని వేడి చేసేందుకు వీలైన పరికరాల వంటివి అందులో ఉన్నాయి. అలాగే.. మంచుచరియలు విరిగిపడటాన్ని ముందుగానే గుర్తించే సాంకేతికత ఉంది. మంచుకొండల్లో సైనికులకు అవసరమయ్యే చాలా వస్తువులను దేశీయంగానే అభివృద్ధి చేశాం. ఇప్పుడు వాటిని సాయుధ దళాలు వినియోగిస్తున్నాయి."

- జీ సతీశ్​ రెడ్డి, డీఆర్​డీఓ ఛైర్మన్​.

భారత భూభాగాన్ని అక్రమించేందుకు చైనా అతిక్రమణలకు పాల్పడిన క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు నెలలుగా పలు దఫాలుగా దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరిగినా.. పరిస్థితులు సద్దుమణగటం లేదు. ఫింగర్​ ఏరియాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు చైనా నిరాకరించటమే అందుకు కారణం.

ఇదీ చూడండి:'చైనా ఏకపక్ష ధోరణి వల్లే ఈ ఉద్రిక్త పరిస్థితులు'

ABOUT THE AUTHOR

...view details