కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. మరోసారి లాక్డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా వైరస్ ప్రభావం అధికంగా చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాల వరకే లాక్డౌన్ను పరిమితం చేయనున్నట్లు వెల్లడించింది. జూన్ 19 నుంచి 30వరకు 12 రోజుల పాటు లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు తెలిపింది.
తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నిపుణుల ప్యానెల్తో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే పళనిస్వామి. చెన్నై, తిరవళ్లూర్, చెంగల్పేట్, కాంచీపురం జిల్లాల్లో 12 రోజులు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో నిత్యవసర సేవలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 21, 28 రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.