తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్లు దాటాలంటే గాల్లో సాహసం చేయాల్సిందే..!

ఉత్తరాఖండ్​ పురోలా ప్రాంతంలో వరద ఉద్ధృతి వల్ల రోడ్డు మార్గం మూతపడింది. వేరే గత్యంతరం లేక చుట్టుపక్కల గ్రామస్థులు తాడును వంతెనగా ఉపయోగించి నీటి ప్రవాహాన్ని దాటుతున్నారు.

By

Published : Aug 17, 2019, 11:28 AM IST

Updated : Sep 27, 2019, 6:46 AM IST

రోడ్డు దాటాలంటే గాల్లో సాహసం చేయాల్సిందే

రోడ్డు దాటాలంటే గాల్లో సాహసం చేయాల్సిందే

దేశంలో చాలా రాష్ట్రాలు వరుణుడి ప్రతాపానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉత్తరాఖండ్​లో 6 రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.

తాజాగా ఉత్తర్​కాశీ పురోలా ప్రాంతంలో వరద ఉద్ధృతికి కొండ చరియలు విరిగి పడ్డాయి. దాంతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేరే గత్యంతరం లేక గ్రామస్థులు తాడును వంతెనలా ఉపయోగిస్తూ.. నదిలా నీరు ప్రవహిస్తున్న మార్గాన్ని దాటుతూ సాహసాలు చేయాల్సి వస్తోంది.

ఇదీ చూడండి:జలవిలయానికి 5 రాష్ట్రాలు కకావికలం

Last Updated : Sep 27, 2019, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details