తెలంగాణ

telangana

సరిహద్దు వివాద చర్చల్లో చైనా గొంతెమ్మ కోర్కెలు..

తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడం సహా బలగాల ఉపసంహరణే లక్ష్యంగా భారత్- చైనా సైన్యాల మధ్య ఎనిమిదో విడత కార్ప్స్‌ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణ డిమాండ్‌కు భారత్​ కట్టుబడి ఉండగా.. చైనా గొంతెమ్మ కోర్కెలు కోరుతోంది.

By

Published : Nov 6, 2020, 10:15 PM IST

Published : Nov 6, 2020, 10:15 PM IST

Ladakh standoff: Indian and Chinese armies hold 8th round of military talks
మీరు అలా చేస్తే.. మేం ఇలా చేస్తాం: చైనా

భారత్‌-చైనా మధ్య లద్ధాఖ్​లో ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు ఎనిమిదో విడత కార్ప్స్​ కమాండ్‌ స్థాయి చర్చలు ప్రారంభమైయ్యాయి. వీటిని చుషూల్‌-మాల్డో పోస్టులో ఉదయం 9.30 గంటలకు మొదలు పెట్టారు. ఇటీవలే 14వ కోర్‌ కమాండర్‌ అధికారిక బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మేనన్‌ భారత్‌ నుంచి ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించడానికి ముందు జరిగిన రెండు విడతల చర్చల్లో కూడా పాల్గొన్నారు.

ఉద్రిక్తతలు తగ్గించుకొని.. ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణ డిమాండ్‌కు భారత్‌ కట్టుబడి ఉంది. మే నెల ముందు నాటి పరిస్థితులు నెలకొనాలని భారత్‌ కోరుతోంది. ఏకపక్షంగా చైనా చేసే డిమాండ్లకు తలొగ్గకూడదని నిర్ణయించుకొంది. ఇది ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఉండాలని భారత్‌ భావిస్తోంది.

ఆరో విడత చర్చల్లో మాత్రం 'అదనపు బలగాల మోహరింపు'ను నిలిపివేయాలని నిర్ణయించాయి ఇరువర్గాలు. ఆ తర్వాత నుంచి ఆ అంశంలో ఎటువంటి పురోగతి లేదు. ఈ సారైనా అవి ఓ కొలిక్కివస్తాయని భారత ఆర్మీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

చైనా గొంతెమ్మ కోర్కెలు..

ఏడో విడత చర్చల్లో గొంతెమ్మ కోర్కెలను బయటపెట్టింది చైనా. భారత్‌ ఫింగర్ నెంబర్‌-3 వరకే పెట్రోలింగ్‌ చేయాలని కోరింది. చైనా ఫింగర్‌ నెంబర్‌ 5 వరకు పెట్రోలింగ్ చేస్తానని తెలిపింది. ఫింగర్‌ నెంబర్‌ 4ను నిస్సైనిక ప్రాంతంగా ఉంచాలని చెబుతోంది. ఇది చైనా ఎప్పుడూ అనుసరించే రెండు అడుగులు ముందుకు.. ఒక అడుగు వెనక్కి అన్న వ్యూహానికి అనుకూలంగా ఉంది.

వాస్తవానికి ఫింగర్‌ 8 వరకు ఎల్‌ఏసీ ఉందని భారత్‌ చేస్తున్న వాదనకు ఇది విరుద్ధం. భారత్‌ దీనిని తిరస్కరించింది. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. భారత్‌ భూమిని వదులుకొనే ప్రశ్నే లేదని తెలిపారు. అంతేకాదు స్పంగూర్‌ సరస్సు వద్ద ఉన్న వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయాలన్న డ్రాగన్‌ డిమాండ్‌ను ఇప్పటికే తిరస్కరించింది భారత్​.

ఇదీ చూడండి:నేపాల్​ ప్రధానితో భారత సైన్యాధిపతి భేటీ

ABOUT THE AUTHOR

...view details