తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భక్తజన సంద్రం

జనవరి 15న ప్రయాగ్​రాజ్​లో ప్రారంభమైన అర్ధ కుంభమేళా నేటితో ముగియనుంది. ఇప్పటి దాకా 22 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

By

Published : Mar 4, 2019, 6:12 AM IST

Updated : Mar 4, 2019, 7:51 AM IST

పవిత్ర స్నాాానాలు ఆచరిస్తున్న భక్తులు

నిత్యం భక్తజన కోటి పవిత్ర స్నానాలు.. హరహర గంగ నినాదాలు.. శివన్నామస్మరణతో అంతులేని ఆధ్యాత్మికత వెల్లివిరిసిన ప్రయాగ్​రాజ్​ అర్ధ కుంభమేళా నేటితో ముగియనుంది. కుంభమేళా ముగింపు, మహాశివరాత్రి పర్వదినం ఒకేరోజు రావడం మరో విశేషం.

ప్రయాగ్​రాజ్​లోని గంగ, యమున, సరస్వతి నదుల సంగమానికి భక్తులు పోటెత్తారు. నేడు ఒక్కరోజే దాదాపు కోటి మంది పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు.

భక్తజన సంద్రమైన ప్రయాగ్​రాజ్​

22 కోట్ల మంది

మకర సంక్రాంతి రోజైన జనవరి 15న ప్రయాగ్​రాజ్​లో అర్ధకుంభమేళా ప్రారంభమైంది. ఇప్పటి దాకా 22 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది.

మకర సంక్రాంతి, మౌనీ అమావాస్య, వసంత పంచమి, పౌష్​ పూర్ణిమ, మాఘీ పూర్ణిమ పర్వదినాల్లో కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. పెద్దలను స్మరిస్తూ తర్పణాలు వదిలారు. కుంభమేళాలో స్నానం సర్వపాప హరణం అనేది భక్తుల విశ్వాసం.

భద్రత నడుమ ప్రశాంతంగా..

పటిష్ఠ భద్రత నడుమ ప్రయాగ్​రాజ్​లో కుంభమేళా ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 20వేల మంది పోలీసులు, ఆరువేల మంది హోంగార్డులు, 40 పోలీస్​స్టేషన్లు, 50 అవుట్​పోస్టులు, 40 ఆగ్నిమాపక కేంద్రాలు, 80 కంపెనీల కేంద్ర బలగాలు, 20 కంపెనీల పీఏసీలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

ఉగ్రవాద నిర్మూలన దళం కమాండోలు, బాంబులు నిర్వీర్యం చేసే బృందాలు, ఇంటెలిజెన్స్​ యూనిట్లనుభద్రత కోసం ప్రత్యేకంగా నియమించారు.

ఈ కుంభమేళాలో సాంకేతికతను అధికంగా వాడారు. భద్రతతో పాటు భక్తులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు.

Last Updated : Mar 4, 2019, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details