తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సభలో బలనిరూపణకు సిద్ధమైన కుమారస్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి అనూహ్య ప్రకటన చేశారు. శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్​ అనుమతి కోరారు.

By

Published : Jul 12, 2019, 2:46 PM IST

కుమారస్వామి

కర్ణాటక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి. ఇప్పటికే ఎమ్మెల్యేల రాజీనామాలతో సతమతమవుతున్న వేళ శాసనసభలో బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్​ రమేశ్​ కుమార్​ అనుమతి కోరారు సీఎం.

"నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. కుర్చీకే అతుక్కుపోవాలని ఇక్కడికి రాలేదు. మీరు (స్పీకర్​) సమయం చెప్పండి. మా బలాన్ని నిరూపించుకుంటాం."

-హెచ్​డీ కుమారస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి

13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఫలితంగా 13 నెలల కాంగ్రెస్-జేడీఎస్​ కూటమి ప్రభుత్వం పతనం అంచులకు చేరుకుంది.

ఇదీ చూడండి: 'కర్​నాటకం' మంగళవారానికి వాయిదా..!

ABOUT THE AUTHOR

...view details