తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2020, 11:53 PM IST

Updated : Feb 29, 2020, 2:24 PM IST

ETV Bharat / bharat

కేరళలో రాష్ట్రవిపత్తు హెచ్చరిక ఉపసంహరణ

ప్రాణంతక కరోనా వైరస్​ కారణంగా కొద్ది రోజుల క్రితం ప్రకటించిన రాష్ట్ర విపత్తు హెచ్చరికను ఉపసంహరించుకుంది కేరళ ప్రభుత్వం. గత కొద్ది రోజులగా ఒక్క కేసూ నమోదు కానందున ఈ నిర్ణయం తీసుకుంది.

kerala-lifts-ncov-state-calamity
కేరళ రాష్ట్రవిపత్తును ఉపసంహరించుకున్న ప్రభుత్వం

కరోనా వైరస్​ భయాందోళనల కారణంగా కేరళ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విధించిన రాష్ట్ర విపత్తు హెచ్చరికను.. ఎత్తివేసింది. 3 వేల మంది అనుమానితులు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కొద్ది రోజులుగా ఒక్క పాజిటివ్​ కేసు కూడా నమోదు కానందున ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా 61 మంది వివిధ ఆస్పత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు.భారత్​లో ఇప్పటివరకు నమోదైన 3 కరోనా కేసులు కేరళకు చెందినవే.

Last Updated : Feb 29, 2020, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details