తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2020, 10:31 PM IST

Updated : Feb 29, 2020, 1:52 AM IST

ETV Bharat / bharat

కేరళ 'రాష్ట్ర విపత్తు'గా కరోనా వైరస్​

కేరళలో కరోనా వైరస్​ వ్యాపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణంతక వైరస్​ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. రాష్ట్రంలో మూడో కేసు నమోదైన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Kerala govt declares coronavirus as State Calamity, after 3rd positive case
కేరళ 'రాష్ట్ర విపత్తు'గా కరోనా వైరస్​

ప్రాణాంతక కరోనా వైరస్​ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది కేరళ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ వెల్లడించారు. మహమ్మారిని నియంత్రించేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.

చీఫ్​ సెక్రటరీ టామ్​ జోస్​ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విపత్తు నిర్వాహక విభాగం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శైలజ స్పష్టం చేశారు.

మూడూ కేరళలోనే...

కరోనా మహమ్మారికి సంబంధించి.. దేశంలో ఇప్పటివరకు 3 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేరళకు చెందినవే. వీరు ముగ్గురు.. కరోనా వైరస్​ పుట్టిన చైనాలోని వుహాన్​ నగరం నుంచి వచ్చినవారే. వీరి ముగ్గురి ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉనట్టు తెలుస్తోంది.

Last Updated : Feb 29, 2020, 1:52 AM IST

ABOUT THE AUTHOR

...view details