తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంభీర్​ క్షమాపణ చెప్పాల్సిందే : కేజ్రీవాల్​

మాజీ క్రికెటర్​, భాజపా నేత గౌతమ్ గంభీర్​కు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ లీగల్ నోటీసు పంపారు. ట్విట్టర్ వేదికగా తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

By

Published : May 12, 2019, 7:29 AM IST

Updated : May 12, 2019, 11:07 AM IST

'గంభీర్​ క్షమాపణ చెప్పు': కేజ్రీవాల్​

గంభీర్​ క్షమాపణ చెప్పాల్సిందే : కేజ్రీవాల్​

భాజపా నేత, మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ తనపై అభ్యంతరకర ట్వీట్లు చేశారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంభీర్ తనకు ​ వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్​ నోటీసులు పంపించారు.

తన గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన గంభీర్​.. ఈ నోటీసు అందిన 24 గంటల్లోనే తన ట్విట్టర్​ ఖాతాలో నిజమైన, సరైన వాస్తవాలను వెల్లడించాలని కేజ్రీవాల్​ డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

గౌతమ్​ గంభీర్​ తూర్పు దిల్లీ లోక్​సభ స్థానం నుంచి భాజపా తరపున పోటీచేస్తున్నారు. ఆయనపై ఆమ్​ ఆద్మీ పార్టీ తరపున అతిశి మార్లేనా పోటీ చేస్తున్నారు. భాజపాపై, గంభీర్​ వ్యాఖ్యలపై అతిశి పరువునష్టం దావా వేశారు. ప్రతిగా గంభీర్​ ట్విట్టర్​లో మరోసారి కేజ్రీవాల్​ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు.

"కేజ్రీవాల్​ లాంటి ముఖ్యమంత్రిని కలిగి ఉన్నందుకు సిగ్గుపడుతున్నా."

" మీ పార్టీ నేత అయిన ఓ మహిళ పట్ల మీ ధోరణిని నేను అసహ్యించుకుంటున్నా. ఇదంతా ఎన్నికల్లో విజయం సాధించడం కోసమేనా? మీరు వ్యర్థ ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి. మీ మెదడును శుభ్రం చేయడానికి మీ పార్టీ గుర్తు చీపురు అవసరం." -గౌతమ్ గంభీర్​, భాజపా నేత, మాజీ క్రికెటర్​

గంభీర్​ వ్యాఖ్యలపై ఆప్​ తరఫున మహమ్మద్​ ఇర్షాద్​ లీగల్​ పరువునష్టం దావా దాఖలు చేశారు. గంభీర్​ ట్వీట్లు పూర్తి నిరాధారంగా, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. గంభీర్​ ట్వీట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని తెలిపారు.

ఇదీ చూడండి: 'టైమ్​​లో మోదీపై కథనం రాసింది పాకిస్థానీ'

Last Updated : May 12, 2019, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details