తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 25 ఏళ్లకు కశ్మీర్​ రహిత భారత్​: వైగో

భారత్​లో ఇక కశ్మీర్​ భాగం కావటం అసంభవమని ఎండీఎంకే అధినేత వై.గోపాలస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భాజపా చాలా పెద్ద తప్పు చేసిందని ఆరోపించారు.

By

Published : Aug 13, 2019, 3:18 PM IST

Updated : Sep 26, 2019, 9:09 PM IST

వైగో

కశ్మీర్​ అంశంలో ఎండీఎంకే అధినేత వైగో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్​ వందో స్వాతంత్ర్య దినోత్సవం వరకు దేశంలో కశ్మీర్​ భాగం కాకుండా పోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై 110వ జయంత్యుత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ఈ విధంగా స్పందించారు.

"భారత్​ 100వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొనే సమయానికి కశ్మీర్​ మన దేశంలో భాగంగా ఉండదు. కశ్మీర్​ను భాజపా బురదలోకి నెట్టేసింది. కశ్మీర్​పై నా అభిప్రాయాన్ని ముందుగానే చెప్పాను. కశ్మీర్​ అంశంలో కాంగ్రెస్​ 30 శాతం, భాజపాది 70 శాతం తప్పు ఉంది."

-వై. గోపాలస్వామి, ఎండీఎంకే అధినేత

వచ్చే నెల 15న అన్నాదురై 110వ జయంతి వేడుకలను పార్టీ ఘనంగా నిర్వహిస్తుందని వైగో స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​కు వస్తా.. ప్రజలను, జవాన్లను కలవనివ్వండి'

Last Updated : Sep 26, 2019, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details