తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2020, 11:17 AM IST

ETV Bharat / bharat

హైవే పక్కనే రన్​వే నిర్మాణం- చైనానే లక్ష్యం!

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో దక్షిణ కశ్మీర్​లో కీలక నిర్మాణాన్ని చేపట్టింది భారత వాయుసేన. బిజ్​బెహారాలోని 44వ నెంబర్​ జాతీయ రహదారి వెంబడి 3 కి.మీ మేర రన్​వేను నిర్మిస్తోంది. అత్యవసర సమయంలో యుద్ధవిమానాలకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

సరిహద్ధులో యుద్ధ విమానాల కోసం రన్​వే నిర్మాణం
Emergency landing airstrip to come up on NH-44 in South Kashmir

దక్షిణ కశ్మీర్​లోని బిజ్​బెహారా ప్రాంతంలో 44వ నెంబరు జాతీయ రహదారి వెంబడి 3 కిలోమీటర్ల రన్​వే నిర్మాణాన్ని ప్రారంభించింది భారత వైమానిక దళం. రెండు రోజులు క్రితం మొదలైన పనులు యుద్ధప్రాతిపదికన జరగుతున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సమయంలో యుద్ధవిమానాలకు ఇది ఎమర్జెన్సీ రన్​వేగా ఉపయోగపడుతుందన్నారు. నిర్మాణ పనుల కోసం ట్రక్కులు, కార్మికులకు జిల్లా అధికారులు పాసులు జారీ చేసినట్లు చెప్పారు.

భారత్​-చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంతో అత్యవసరంగా ఈ రన్​వే నిర్మాణాన్ని చేపట్టింది భారత వైమానిక దళం. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు ఇప్పటికే భారీగా బలగాలను మోహరించాయి.

ABOUT THE AUTHOR

...view details