తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీలంకలో నలుగురు జేడీఎస్​ నేతలు మృతి

ఈ నెల 20న శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఏడుగురు జేడీఎస్​ నేతల్లో నలుగురు ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.

By

Published : Apr 22, 2019, 10:48 AM IST

Updated : Apr 22, 2019, 3:39 PM IST

శ్రీలంక పేలుళ్లలో జేడీఎస్​ నేతలు గల్లంతు

శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు జేడీఎస్​ నేతలు మృతిచెందారు. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ధ్రువీకరించారు. పార్టీ సభ్యుల మరణం కలచివేసిందని ట్వీట్ చేశారు. భారత విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

లక్ష్మణ గౌడ రమేష్​, కేఎమ్​ లక్ష్మీనారాయణ, ఎమ్​ రంగప్ప, కేజీ హనుమంతరాయప్ప పేలుళ్లకు ప్రాణాలు కోల్పాయారు. మరో ముగ్గురు నేతలు హెచ్​ శివకుమార్​, ఏ మారెగౌడ, హెచ్​ పుట్టరాజు గల్లంతయ్యారు.

శ్రీలంకలో జేడీఎస్​ నాయకులు
జేడీఎస్​ నేతలు

ఏడుగురు జేడీఎస్​ నేతలు ఈనెల 20న కొలంబో చేరుకున్నారు. అక్కడి షంగ్రీలా హోటల్​లో బసచేశారు. పేలుళ్ల ఘటన తర్వాత కుటుంబసభ్యులకు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అనేక గంటల తర్వాత తెలిసింది. మిగిలిన వారి పరిస్థితిపై ఇంకా స్పష్టత లేదు.

శ్రీలంకలో ఆదివారం జరిగిన మారణకాండలో 290మంది మృతిచెందారు. మరో 500 మంది ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

ఇదీ చూడండి:శ్రీలంకలో మరో బాంబు నిర్వీర్యం- భయంతో జనం

Last Updated : Apr 22, 2019, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details