తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామా: గ్రెనేడ్​ దాడిలో జవానుకు గాయాలు

పుల్వామాలో విధులు నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్​తో దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఒక జవాను గాయపడ్డారు.

By

Published : Mar 30, 2019, 5:36 PM IST

పుల్వామాలో ఉగ్రవాదుల దాడి

జమ్ము కశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పట్టణంలోని ఎస్​బీఐ బ్యాంకు సమీపంలో విధుల్లో ఉన్న సీఆర్​పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్​తో దాడి చేశారు ముష్కరులు. ఈ ఘటనలో ఓ జవాను గాయపడ్డారు.

అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. సమీప ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​ సమీపంలో పేలుడు

ABOUT THE AUTHOR

...view details