తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్షణక్షణం భయం భయం.. కళ చెదిరిన కశ్మీరం

జమ్ముకశ్మీర్​ పర్యాటక రంగం కళ చెదిరింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. భయంతో  సందర్శకులు కశ్మీర్​ అందాలను చూడటానికి వెనకడుగు వేస్తున్నారు. తమ వ్యాపారం దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Aug 4, 2019, 8:07 AM IST

కళ చెదిరిన కశ్మీరం

ఉద్రిక్త వాతావరణం.. అమర్​నాథ్​ యాత్రికుల తిరుగు ప్రయాణం.. భారీగా బలగాల మోహరింపు.. ప్రజల గుండెల్లో గుబులు.. ఇదీ జమ్ముకశ్మీర్​లో ప్రస్తుత పరిస్థితి.

వారం రోజుల్లో కశ్మీర్​లో పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్​ లోయ ఒక్కసారి ఉలిక్కిపడింది. ఒకవైపు ఉగ్రముప్పు పొంచి ఉందన్న వార్తలతో అమర్​నాథ్​ యాత్రికులను వెళ్లిపొమ్మని ప్రభుత్వం హెచ్చరిచ్చింది. మరోవైపు రాష్ట్రంలో భారీ సంఖ్యలో భద్రతా దళాల మోహరింపు స్థానికులను కలవరపెడుతోంది.

ఈ ప్రభావం జమ్ముకశ్మీర్​ పర్యాటక రంగంపై పడింది. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే ఎన్నో అందమైన ప్రదేశాలు... తాజా పరిస్థితులతో వెలవెలబోతున్నాయి. రోడ్లు, ఉద్యానవనాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారు.

"నేను మొఘల్​ గార్డన్​లో ఫొటోగ్రఫీ పని చేస్తాను. తాజా వార్తలతో నేను చేసే పని దెబ్బతింది. ప్రజల మనసులో భయం నాటుకుపోయింది. అందుకే ఇక్కడికి ఎవరు రావట్లేదు. పని తగ్గిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 10-12 ఏళ్లు అవుతోంది. కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. చాలా కష్టంగా ఉంది."
- ఫొటోగ్రాఫర్​

ఎన్​కౌంటర్​, కాల్పుల విరమణలతో నిత్యం వార్తల్లో నిలిస్తుంది జమ్ముకశ్మీర్. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి వల్ల రాష్ట్రంలో ఉద్రిక్తత తారస్థాయికి చేరుకుంది. అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో తాజా పరిస్థితులు ప్రజలకు నిద్రలేని రాత్రులను మిగలుస్తున్నాయి.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ప్రధాని హామీకి నేతల డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details