తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైట్లీ జీవితమే మా అందరికీ స్ఫూర్తి: మోదీ

దేశం కోసం కష్టపడే తత్వం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ నుంచే తామంతా నేర్చుకున్నామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అలాంటి మిత్రుడికి శ్రద్ధాంజలి ఘటించే రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన సంస్మరణలో సభకు హాజరయ్యారు మోదీ.

By

Published : Sep 10, 2019, 7:10 PM IST

Updated : Sep 30, 2019, 3:58 AM IST

మోదీ జైట్లీ

జైట్లీ జీవితమే మా అందరికీ స్ఫూర్తి

కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ గొప్ప నేతని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. దిల్లీలోని జవహార్​ లాల్​ నెహ్రూ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు. జైట్లీ చాలా రోజులుగా అనారోగ్యంగా ఉన్నారని, కానీ ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడేవారు కాదని తెలిపారు.

నిరంతరం దేశ ఉజ్వల భవిష్యత్తు కోసమే ఆలోచించేవారన్నారు. అదే స్ఫూర్తితో తాము దిశగా నడిచామని తెలిపారు. ఆయన జ్ఞానం అపారమనీ, అది దేవుడు ఇచ్చిన వరమని కితాబిచ్చారు.

"ఆయన చేసిన సేవలకు గౌరవపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. నా స్నేహితునికి నివాళులు అర్పిస్తున్నా. ఒక గొప్ప పాత మిత్రుడు.. వయసులో చిన్నవాడు... ఆయనకు నేను శ్రద్ధాంజలి ఘటించే రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదు. ఓ శాంతి."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా అరుణ్​ జైట్లీ అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడంపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారు ప్రధాని.

ఇదీ చూడండి: జైట్లీ మృతిపై మోదీ భావోద్వేగ సందేశం

Last Updated : Sep 30, 2019, 3:58 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details