తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐటీ దాడుల్లో రాజకీయ కోణం లేదు'

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు, వారి సంబంధీకుల ఇళ్లల్లో ఐటీ సోదాలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దాడుల్లో రాజకీయ కోణం లేదని, వాళ్లకున్న సమాచారం మేరకే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు జైట్లీ.

By

Published : Apr 10, 2019, 5:38 PM IST

అరుణ్ జైట్లీ

ఎన్నికల వేళ రాజకీయ కోణంలో ఐటీ దాడులు జరగుతున్నాయన్న విపక్షాల ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీ. వాళ్లకున్న సమాచారం, ఆధారాల మేరకే ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.

పలు రాష్ట్రాల్లోని ముఖ్య నేతల అనుచరులు, సంబంధీకుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​, కర్ణాటకలో జేడీఎస్​ పార్టీకి చెందిన ఓ మంత్రి, తమిళనాడులోని డీఎంకే పార్టీ నేత అనుచరులపై ఐటీ దాడులు జరిగాయి.

విపక్షాల ఆరోపణలు

రాజకీయ కోణంలోనే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్​తో సహా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఐటీ దాడులకు సంబంధించి రెవెన్యూ కార్యదర్శి అజయ్​ భూషణ్​ పాండేకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలు తటస్థంగా వ్యవహరించాలని నొక్కి చెప్పింది.

ఈ పరిస్థితుల్లో అమెరికాలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ప్రపంచ బ్యాంకు సమావేశానికి హాజరైన జైట్లీ.. ఐటీ శాఖ దాడులపై ఫేస్​బుక్​ పేజీలో స్పందించారు.

"ఐటీ దాడుల్లో రాజకీయ ద్వేషమేమీ లేదు. ఈ మధ్య కాలంలో దాడులు జరిగితే రాజకీయాలకు అంటగట్టడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఆరోపణలు చేసి అవినీతి నేరం నుంచి తప్పించుకోలేరు. అవినీతికి పాల్పడిన వారందరికీ శిక్ష తప్పనిసరి.

ఏకపక్షంగా దాడులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే అవతలివాళ్లపైనా ఆరోపణలు వచ్చేదాకా సమానత్వం అనే ధర్మాన్ని పాటించి చర్యలు తీసుకోవద్దా? రెవెన్యూ శాఖ వద్ద ఉన్న సమాచారం, ఆధారాల ప్రకారం వాళ్లు సోదాలు నిర్వహిస్తారు. ఐటీ శాఖ దాడికి గురైన వారు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినట్టే. "
- అరుణ్​ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

ఇదీ చూడండి: 'కక్ష సాధింపు కోసమే ఐటీ దాడులు'

ABOUT THE AUTHOR

...view details