తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2021, 9:12 AM IST

ETV Bharat / bharat

పాల్​ దినకరన్​ ఇంట్లో 5 కిలోల బంగారు కడ్డీలు

తమిళనాడులోని క్రైస్తవ మత ప్రచారకుడు పాల్​ దినకరన్​ ఇళ్లు, సంస్థల్లో ఐటీశాఖ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో లెక్కలోకి రాని రూ.120 కోట్ల పెట్టుబడులను గుర్తించింది. 5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకుంది.

Paul Dinakaran
పాల్‌ దినకరన్‌ ఇళ్లు, సంస్థల్లో ఐటీ సోదాలు

క్రైస్తవ మత ప్రచారకుడు పాల్‌ దినకరన్‌ ఇళ్లు, కార్యాలయాలు, సంస్థలు, ఫౌండేషన్‌లలో తమిళనాడు ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం నుంచి సోదాలు చేస్తున్నారు. లెక్కలోకి రాని రూ.120 కోట్ల పెట్టుబడులు గుర్తించారు. కోయంబత్తూరులోని కారుణ్య విశ్వవిద్యాలయంలో 5 కిలోల బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకొన్నారు. విచారణకు హాజరుకావాలని ఆయనకు అధికారులు నోటీసు పంపారు.

పాల్‌ దినకరన్‌కు చెందిన 'జీసస్‌ కాల్స్‌' సంస్థ కార్యాలయాలు, కారుణ్య విశ్వవిద్యాలయం తదితర 28 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. 20వ తేదీన ప్రారంభించిన ఈ సోదాలు శనివారం ఉదయం ముగిశాయి. సభల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని.. స్వదేశం, విదేశాల నుంచి వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారని సమాచారం.

ఇదీ చూడండి:వైరల్: స్నేహితుడిని చితకబాదిన యువకులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details