తెలంగాణ

telangana

'మోదీజీ... పరువు పోతోంది... అర్థమవుతోందా?'

By

Published : Jul 15, 2020, 4:22 PM IST

కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. చాబహర్​ ఓడరేవు రైల్వే నిర్మాణాన్ని భారత్​కు బదులుగా ఇరాన్ సొంతంగానే చేపట్టనుందనే కథనాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కార్​పై విమర్శలు గుప్పించారు.

India's global strategy in tatters, losing respect everywhere: Rahul
మోదీ సర్కార్ విదేశాంగ విధానంపై రాహుల్ ధ్వజం

మోదీ సర్కార్ విదేశాంగ విధానం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతిష్ఠ మసకబారుతోందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రతి చోట గౌరవం కోల్పోతున్నామని, అయినా ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదని ట్వీట్ చేశారు.

చాబహర్ నౌకాశ్రయం నుంచి అఫ్గానిస్థాన్​ సరిహద్దు వెంబడి ఉన్న జహదన్ ప్రాంతం వరకు రైల్వే మార్గాన్ని భారత్​కు బదులుగా ఇరాన్ ప్రభుత్వమే సొంతంగానే నిర్మించాలనుకుంటోందన్న వార్తల్ని ప్రస్తావిస్తూ ఈ విమర్శలు చేశారు రాహుల్.

"భారత వీదేశీ వ్యూహం చిందరవందరగా ఉంది. మనం ప్రతి చోట గౌరవం, అధికారాన్ని కోల్పోతున్నాం. భారత ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియడం లేదు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

చైనా కారణమా?

చైనాతో ఆర్థిక, రాజకీయ సహకారానికి సంబంధించి ఇరాన్ ఓ ముసాయిదాను ఆమోదించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ మేరకు నిధుల జాప్యం పేరిట చాబహర్ ఓడరేవు ప్రాజెక్టు నుంచి భారత్​ను తప్పించడానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టేందుకు నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం ఇరాన్​తో ఒప్పందం చేసుకుంది.

ఇదీ చదవండి-భారత్​కు ఇరాన్​ ఝలక్​- చైనాతో సీక్రెట్ డీల్​ వల్లే!

ABOUT THE AUTHOR

...view details