తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నియంత్రణ రేఖ వద్ద భద్రత మరింత పటిష్ఠం

భారత్​-పాక్​ నియంత్రణ రేఖ వద్ద గస్తీని కట్టుదిట్టం చేసింది సైన్యం. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా డేగ కన్నుతో పహారా కాస్తున్నాయి బలగాలు. కశ్మీర్​లో ఆంక్షలు ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం వేడుకల అనంతరం ఆంక్షలను కాస్త సడలించే అవకాశం ఉంది.

By

Published : Aug 14, 2019, 2:27 PM IST

Updated : Sep 26, 2019, 11:49 PM IST

నియంత్రణ రేఖ వద్ద భద్రత మరింత పటిష్ఠం

స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా సరిహద్దు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. భారత్​-పాక్​ నియంత్రణ రేఖ వద్ద గస్తీని పెంచారు.

నియంత్రణ రేఖ వద్ద భద్రత మరింత పటిష్ఠం
పాకిస్థాన్​ నేడు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది. రేపు భారత్​లో వేడుకలు మిన్నంటనున్నాయి.

370 అధికరణ రద్దుతో కశ్మీర్​లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మోదీ సర్కారు పలు ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ విధింపుతో కశ్మీర్​ లోయలో ప్రజలు 9వ రోజు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశ స్వాతంత్ర్య వేడుకల తర్వాత ఆంక్షలు కాస్త సడలించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పాక్​ వేడుకలు...

పాకిస్థాన్​ 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. దిల్లీలోని పాక్​ హైకమిషన్​ కార్యాలయంలోనూ ఈ వేడుకలు జరిగాయి. ఆగస్టు 14ను కశ్మీరీ సంఘీభావ దినంగా ప్రకటించింది పాకిస్థాన్​. ఈ సందర్భంగా పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ పంపిన సందేశాన్ని వారి హైకమిషనర్​ చదివి వినిపించారు.

"కశ్మీరీ సోదరులకు ఈ సందర్భంగా మరోసారి హామీ ఇస్తున్నాం. పాకిస్థాన్​ మీకు రాజకీయ, నైతిక, న్యాయపరమైన మద్దతును కొనసాగిస్తుంది. మీరు మీ అస్థిత్వం కోసం పోరాడండి."
- పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ సందేశం

Last Updated : Sep 26, 2019, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details