తెలంగాణ

telangana

By

Published : Oct 28, 2019, 1:14 PM IST

Updated : Oct 28, 2019, 2:58 PM IST

ETV Bharat / bharat

మోదీకే అనుమతి ఇవ్వరా.. పాక్​పై భారత్​ ఫిర్యాదు.!

తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు ప్రధాని మోదీకి పాకిస్థాన్​ అనుమతించకపోవడంపై భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ)కు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మోదీకే అనుమతి ఇవ్వరా.. పాక్​పై భారత్​ ఫిర్యాదు..!

మోదీకే అనుమతి ఇవ్వరా.. పాక్​పై భారత్​ ఫిర్యాదు.!

ప్రధాని మోదీ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాకిస్థాన్‌ అనుమతించకపోవడంపై భారత్‌ మండిపడింది. దాయాది దేశంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓకు ఫిర్యాదు చేసింది.

ప్రధాని మోదీ సౌదీ పర్యటన నేపథ్యంలో భారత్ అభ్యర్థనను పాక్‌ తోసిపుచ్చింది. తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు దాయాది దేశం అంగీకరించని నేపథ్యంలో భారత్​ ఈ నిర్ణయం తీసుకుంది. సహజంగా ఐసీఏఓ నిబంధనల ప్రకారం ప్రతి దేశం వీవీఐపీల గగనతల ప్రయాణాలకు అనుమతులిస్తాయి. ఇదివరకే రెండుసార్లు పాక్‌ ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడిన కారణంతో విసిగిపోయిన భారత్​.. ఆ దేశానికి బుద్ధి చెప్పదలచుకుంది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం.. పాక్​ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు మోదీకి ఇప్పటికే రెండుసార్లు అనుమతి నిరాకరించింది.

ఇదీ చూడండి:దీపావళి రోజు స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ జవాన్లు

Last Updated : Oct 28, 2019, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details