తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-చైనా దౌత్యస్థాయి చర్చలు.. సానుకూలమేనా?

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​, చైనా మధ్య బుధవారం మరోమారు దౌత్యస్థాయి చర్చలు జరిగాయి. ఇటీవలే జరిగిన ఆరో దశ సీనియర్​ కమాండర్​ స్థాయి చర్చల్లోని ఫలితాలపై.. ఇరుదేశాలు సానుకూలంగా స్పందించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. త్వరలోనే ఏడోదశ కమాండర్​ స్థాయి చర్చలకు అంగీకరించినట్లు తెలిపింది.

By

Published : Sep 30, 2020, 10:13 PM IST

Updated : Sep 30, 2020, 10:36 PM IST

SINO-INDIA TALKS
భారత్​, చైనా దౌత్యస్థాయి చర్చలు

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనపై బుధవారం మరోమారు సమావేశమయ్యాయి భారత్​, చైనా. ఈ మేరకు ఇరు దేశాల మధ్య దౌత్యస్థాయి చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో స్థిరత్వం, అసమానతలను తొలిగించటంపై గత సైనిక స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిన అవసరాన్ని ఇరు దేశాల అధికారులు నొక్కిచెప్పారు.

సరిహద్దు వ్యవహారాలపై 'వర్కింగ్​ మెకానిజం ఫర్​ కన్సల్టేషన్​ అండ్​ కోఆర్డినేషన్'​(డబ్ల్యుఎంసీసీ) ఆధ్వర్యంలో.. వర్చువల్​గా నిర్వహించిన చర్చల అనంతరం ఓ ప్రకటన విడుదల చేసింది భారత విదేశాంగ శాఖ.

"వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితులపై ఇరువర్గాలు సమీక్షించాయి. సీనియర్​ కమాండర్ల మధ్య జరిగిన ఆరోదశ చర్చల ఫలితాలపై ఇరువైపుల నుంచి సానుకూల స్పందన లభించింది. సరిహద్దుల్లో స్థిరత్వం, అసమానతలను తొలగించేందుకు 6వ దశ సీనియర్​ కమాండర్​ స్థాయి చర్చల్లో ప్రస్తావించిన విధానాలను అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాం. ఇరుదేశాల క్షేత్రస్థాయిలోని కమాండర్ల మధ్య కమ్యునికేషన్​ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నాం. ఎల్​ఏసీ వెంబడి అన్ని ఫింగర్​ పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ఒప్పందాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశాం."

- భారత విదేశాంగ శాఖ.

సెప్టెంబర్​ 21న ఇరు దేశాల సీనియర్​ కమాండర్ల స్థాయిలో ఆరోదశ చర్చలు జరిగాయి. సుమారు 14 గంటల పాటు చర్చించి.. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు సంయుక్త ప్రకటన చేశారు. ఇందులో సరిహద్దులకు అదనపు బలగాల తరలింపు నిలిపివేత, సరిహద్దులో మార్పు చేసే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకపోవటం, ఉద్రిక్తతలు పెంచే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని నిర్ణయించారు.

త్వరలోనే 7వ దశ కమాండర్​ స్థాయి భేటీ

బుధవారం నిర్వహించిన దౌత్య స్థాయి సమావేశంలో.. 7వ దశ సీనియర్​ కమాండర్​స్థాయి భేటీకి భారత్​, చైనా అంగీకరించాయి. ఈ మేరకు త్వరలోనే ఈ సమావేశం ఉంటుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. బుధవారం జరిగిన సమావేశంలో భారత్​కు విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వం వహించగా.. చైనా తరఫున సరిహద్దు, సముద్ర విభాగం డైరెక్టర్​ జనరల్​ హాజరయ్యారు. డబ్ల్యూఎంసీసీ ఆధ్వర్యంలో ఇది 19వ సమావేశం.

ఇదీ చూడండి: సరిహద్దుల నుంచి వైదొలగాల్సిందే!

Last Updated : Sep 30, 2020, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details