తెలంగాణ

telangana

By

Published : Aug 28, 2020, 11:12 AM IST

ETV Bharat / bharat

'ఈటీవీ'కి ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు

25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశ, విదేశాల్లోని తెలుగు వారి హృదయాలను గెలుచుకుని, ప్రజల ఆదరణ పొందిందని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు.

venkaiah nayudu
'ఈటీవీ'కి ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు

తొలి తెలుగు శాటిలైట్​ ఛానల్​ ఈటీవీ.. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు . ఈటీవీ కీలక మైలురాయిని అందుకుందని కొనియాడారు. రామోజీ గ్రూపు, ఈటీవీ తెలుగు యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఈటీవీకి శుభాకాంక్షలు తెలుపుతు.. ఉపరాష్ట్రపతి పంపిన లేఖ

" గడిచిన 25 ఏళ్లలో 7 కోట్లకుపైగా వీక్షకులతో అత్యంత ఆదరణ పొందిన ఛానల్​గా ఈటీవీ అవతరించింది. దేశ, విదేశాల్లోని తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈటీవీకి నా అభినందనలు. ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తూ.. సాధికారతవైపు నడిపిస్తోంది"

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ఈటీవీ తన ప్రమాణాలు, విలువలను కొనసాగిస్తూ.. విశ్వసనీయతను కాపాడుకుంటోందని ప్రశంసించారు వెంకయ్య. రైతుల్లో అవగాహన కల్పిస్తూ.. వారిని సాధికారత వైపు నడిపించేందుకు ఈటీవీ చేపట్టిన అన్నదాత కార్యక్రమం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఈటీవీ రజతోత్సవ వేళ.. తారల శుభాకాంక్షల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details